ఆ విషయంలో చంద్రబాబు 'ది బెస్ట్' : నీతి ఆయోగ్ సీఈవో వెల్లడి!
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్యాష్ బోర్డును ప్రశంసించారు నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్. నేటి ఉదయం నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా.. ఉత్తమ విధి విధానాలను అనుసరించే రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ఇవ్వాలంటూ అమితాబ్ ను కోరారు చంద్రబాబు.
ఇక ఏపీ సీఎం డ్యాష్ బోర్దును 'ది బెస్ట్' అంటూ అమితాబ్ మెచ్చుకున్నారని తెలుస్తోంది. దేశంలో అవలంభిస్తోన్న విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి సంరక్షణ విధానాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ భేటిలో ఏపీ ప్రభుత్వ పనితీరు గురించి అమితాబ్ కు వివరించారు చంద్రబాబు.

రాష్ట్రంలో అన్ని శాఖలను డిజిటలైజ్ చేశామని, రియల్ టైంలో జీఎస్డీపీని అంచనా వేస్తున్నామని అమితాబ్ తో చంద్రబాబు పేర్కొన్నారు. పల్స్ సర్వే రిపోర్టులు చేతికందితే ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.10వేల కనీస ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టామని అమితాబ్ తో చెప్పారు చంద్రబాబు.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ తో భేటీకి ముందు నీతి ఆయోగ్ ఛైర్మన్ పనగారియాను హోటల్ గేట్ వేలో కలిశారు చంద్రబాబు. ఇద్దరి మధ్య కాసేపు భేటీ జరగ్గా.. అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications