Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Polavaram:పోలవరంకు మహర్దశ - చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. బుధవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జూన్ నెలాఖరు నాటికి వెలిగొండ స్టేజ్-1 పనులను పూర్తి చేయాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు.

పోలవరం.. పర్యాటక స్వర్గధామం

పోలవరం ప్రాజెక్టు కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.ప్రాజెక్టు పరిసరాల్లో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, షాపింగ్ ఏరియాలు, సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.పోలవరం నుండి పాపికొండలు, భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యాలు కల్పించాలని, స్పోర్ట్స్ థీమ్స్ మరియు ఫారెస్ట్ అట్రాక్షన్లతో పర్యాటకులను ఆకట్టుకోవాలని ఆదేశించారు.రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు.

cm-chandrababu-naidu-reviews-and-sets-deadlines-for-irrigation-projects-pushes-polavaram-as-tourism

నదుల అనుసంధానం - ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు

ఉత్తరాంధ్ర ప్రాధాన్యతను వివరిస్తూ.. వంశధార-నాగావళి నదుల అనుసంధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి, నాగావళి-చంపావతి అనుసంధానాన్ని జూలై నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నేరడి బ్యారేజీ పనులకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. తారకరామ, మహేంద్రతనయ, తోటపల్లి బ్యారేజీ వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ఏం చేస్తున్నారు, ఇక సిద్దంగా ఉండండి - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

పెరిగిన భూగర్భ జలాలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భూగర్భ జలాల లభ్యత గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు 12 టీఎంసీలు పెరిగి, ప్రస్తుతం 625 టీఎంసీలకు చేరుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.79 మీటర్ల మేర భూగర్భ జల మట్టం పెరిగింది.సుమారు 5,697 గ్రామాలలో కేవలం 8 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉండటం శుభపరిణామమని సీఎం పేర్కొన్నారు.

రాయలసీమకు ఊరట
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి మాల్యాల లిఫ్ట్ ద్వారా ఇప్పటికే 52 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించినట్లు అధికారులు నివేదించారు. హంద్రీ-నీవా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికపుడిశెల వంటి ప్రాజెక్టుల పురోగతిని కూడా సీఎం ఈ సందర్భంగా సమీక్షించారు.

చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, జలవనరుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటు పోలవరాన్ని పర్యాటక హబ్‌గా మార్చడం, ఇటు వెలిగొండ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జలవనరుల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని ఈ సమావేశం ద్వారా స్పష్టమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+