వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ డేరింగ్ డెసిషన్: వారి కోసం జీరో వడ్డీ పథకం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలోనూ బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు అండగా ఉంటానని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు . ఒక పక్క కరోనాతో రాష్ట్రం సతమతమవుతున్న కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాల అమలులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వెయ్యటం లేదు. ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలు సమర్థంగా అమలు చేస్తూనే , రాష్ట్ర ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటూనే సీఎం జగన్ గత సర్కారు హయాంలో ఆగిపోయిన ఓ పథకాన్ని తిరిగి ప్రారంభించి మహిళలకు బాసటగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు .

పొదుపు సంఘాల మహిళలకు ఈ కష్టకాలంలోనూ గుడ్ న్యూస్ చెప్పిన జగన్

పొదుపు సంఘాల మహిళలకు ఈ కష్టకాలంలోనూ గుడ్ న్యూస్ చెప్పిన జగన్

ఒకపక్క రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి విపత్తు, మరో పక్క ప్రతిపక్ష పార్టీల విమర్శలు , ఇంకోపక్క ఆర్ధికఇబ్బందులు .. ఎన్ని ఉన్నా సరే పాలనలో జగన్ తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు . రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు ఈ కష్టకాలంలోనూ గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నారు సీఎం జగన్. ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. దీని ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రూ.1,400 కోట్ల మేర లబ్ధి చేకూరనున్నట్టు తెలుస్తుంది .

 పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించే పథకం పునఃప్రారంభం

పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించే పథకం పునఃప్రారంభం

పొదుపు సంఘాల మహిళలకు జీరో వడ్డీ రుణాలను ఇవ్వటం ద్వారా వారి ఆర్ధిక స్వావలంబనకు ఆలంబన ఇచ్చినట్టు అవుతుందని సీఎం జగన్ ఉద్దేశం . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాం నుంచే పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించే పథకం ఉండేది. కానీ గత ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకుండా ఈ పథకం అమలును పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి . 2016 జూన్‌ నుంచి జీరో వడ్డీ పథకం అమలుకు నోచుకోవడం లేదు. అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏపీ సర్కార్ ఈ పథకాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించనుంది.

 జీరో వడ్డీ పథకం అమలుకు రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

జీరో వడ్డీ పథకం అమలుకు రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

ఇక ఇప్పటికే పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి జీరో వడ్డీ పథకం అమలుకు రూ.765.19 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ పథకం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు లబ్ది చేకూరుతుంది . రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు వడ్డీ లేని రుణాల క్రింద రూ.975 కోట్ల సాయం అందనుంది. ఇక పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలకు 1.83 లక్షల సంఘాలకు వడ్డీ లేకుండా రూ.425 కోట్ల చొప్పున లబ్ధి చేకూరుతుంది.

కరోనా కష్ట కాలంలోనూ సాహసోపేతమైన నిర్ణయాలతో ఏపీ సర్కార్

కరోనా కష్ట కాలంలోనూ సాహసోపేతమైన నిర్ణయాలతో ఏపీ సర్కార్

ఇక రాష్ట్ర వ్యాప్తంగాఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మొత్తం 93 లక్షల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.ఈ పథకానికి సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు ఏపీ ప్రభుత్వం తాజాగా రూ.765.19 కోట్లను విడుదల చేసింది. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు నేడో, రేపో విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక కరోనా కష్టకాలంలో కూడా ఈ తరహా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ఏపీలో ప్రజలకు ఆర్ధిక భరోసా అందిస్తున్నారు .తన మార్క్ పాలన చూపిస్తున్నారు .

Recommended Video

Coronavirus : Swiggy Delivery Boy In Hyderabad Tests Positive For Covid-19

English summary
93 lakhs of women from all over the state are expected to tell good news in this difficult time. The Zero Interest Scheme will be reopened on the 24th of this month for Dwakra women. It will benefit women in savings associations to the tune of Rs 1,400 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X