కౌలు రైతుల రుణాలపై బ్యాంకర్లపై సీఎం జగన్ అసంతృప్తి .. ఆ మార్గాలపై ఫోకస్ పెట్టాలని సలహా
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం కోసం బ్యాంకులు ముందుకు రావాలని, కౌలు రైతులు ఆందోళన విషయంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్న సీఎం జగన్ ప్రభుత్వం నుండి బ్యాంకులకు గతంలో చెల్లించాల్సిన వడ్డీ లేని రుణాలు కింద ఉన్న బకాయిలను చెల్లించామని, బ్యాంకర్ల సహకారం ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు.
Recommended Video
సీఎం జగన్ .. రంగులకి ఓ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది... టీడీపీ నేత గోరంట్ల సెటైర్
రైతులకు బ్యాంకర్లు 99 శాతం పంట రుణాలు ఇచ్చారన్న జగన్
కౌలు
రైతులకు
సహకారం
అందించే
విషయంలో
బ్యాంకులు
మరింత
చిత్తశుద్ధితో
వ్యవహరించలేదని
పేర్కొన్న
జగన్మోహన్
రెడ్డి
రైతులకు
బ్యాంకర్లు
99
శాతం
పంట
రుణాలను
ఇచ్చారని
పేర్కొన్నారు
.
అయితే
వారి
ఆదాయ
మార్గాలను
పెంచే
విధానాలపై
బ్యాంకర్లు
కూడా
ఫోకస్
చెయ్యాలని
కోరారు.
213
వ
ఎస్
ఎల్
బీసీ
సమావేశంలో
వ్యవసాయ
రుణాల
పై
చర్చించారు.
రైతుల
ఆదాయం
రెట్టింపు
చేయాలన్న
దానిపై
బ్యాంకర్లు
ఫోకస్
చేయాలని
సీఎం
జగన్
సూచించారు.
విపత్తుల సమయంలో రైతులకు చేదోడుగా బ్యాంకర్లు నిలవాల్సిన అవసరం
విపత్తుల సమయంలో రైతులకు చేదోడుగా బ్యాంకర్లు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఎంఎస్ఎంఈలకు కూడా అండగా నిలబడితే ఆర్థికవ్యవస్థ బాగుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అసంఘటిత రంగం కింద ఉన్న చిరు వ్యాపారులను కూడా బ్యాంకర్లు తోడ్పాటు అందించి ముందుకు తీసుకు రావాలని, చిరు వ్యాపారులు విషయంలో ప్రభుత్వం షూరిటీ ఇస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎస్ ఎల్ బీసీ మీటింగ్ లో జగన్ .. చిరువ్యాపారులకు , మహిళలకు బ్యాంకర్ల తోడ్పాటు
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఎల్బిసి మీటింగ్ లో పాల్గొన్న జగన్ జగనన్న తోడు క్రింద చిరు వ్యాపారులకు 10000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారి జీవితాలను మార్చటానికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని జగన్ ఈ సందర్భంగా కోరారు. మహిళలు సాధికారత సాధించడం కోసం బ్యాంకులు సహకారం అందించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.
సంక్షేమ పథకాలకు బ్యాంకర్ల సహకారం కోరిన జగన్
2014 నుండి పరిశ్రమల రాయితీల బకాయిలను 1,100 కోట్ల మేర చెల్లించామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు అందించాల్సిన తోడ్పాటును ఎప్పటికప్పుడు అందించాలని కోరారు జగన్. తాడేపల్లి లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కన్నా బాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, సీరియస్ నీలం సాహ్ని, ఆర్బిఐ ప్రాంతీయ డైరెక్టర్ కే నిఖిల తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.