నా భర్తపై కేసీఆర్ కక్ష కట్టారు: రేవంత్ భార్య, టీడీపీ నేతలపైనా ఆగ్రహం?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం నాడు ఉదయం లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తమ పార్టీకి చెందిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేల పైన రేవంత్ సతీమణి గీత అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంతమంది రాజకీయ నాయకులు, సీనియర్లు ఉండి తన భర్తను ఇరికించారని, ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆమె మండిపడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలు పరామర్శకు ఇంటికి వెళ్లారు.

తన భర్తను కావాలనే కొందరు ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తన భర్త పైన కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్తను తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదో రకంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతోందని తాము ముందే ఊహించామని చెప్పారు. ఆమెను ఓదార్చేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు. రేవంత్ కేసు నుండి బయటపడతారని, తామంతా ఆయన వెనకే ఉన్నామని చెప్పారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications