ఏపీలో కుప్పకూలిన వంతెన: ఏపీ, తెలంగాణాల మధ్య ఆ మార్గంలో రాకపోకలు బంద్!!
ఏపీలో రోడ్లు, వంతెనలు పాడైపోతున్నా, కుప్ప కూలిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఏపీ వాసులు పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని కూడా ప్రతిపక్ష పార్టీలు అనేకమార్లు ఆందోళనలు చేశాయి. జగన్ సర్కార్ హయాంలో గుంతల మయంగా రోడ్లు మారి నరకాన్ని తలపిస్తున్నాయి అని టీడీపీ, జనసేన, బీజేపీ లు సైతం ఆందోళనలు నిర్వహించాయి.
ఏపీలో పరిస్థితులు మారలేదు. రోడ్ల దుస్థితి అక్కడ పాలనను కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. తాజాగా ఇక ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణాలు చేసేవారికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోవటంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై ఉన్న మోరీ వంతెన కుప్ప కూలింది. దీంతో వాహన రాక పోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. కాలినడకన వెళ్ళే వీలు కూడా లేక పోవటంతో కాలినడకన వెళ్ళే పాదచారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అధిక లోడుతో నిత్యం లారీలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న క్రమంలో రోడ్డు ధ్వంసం అయ్యిందని స్థానికులు చెప్తున్నారు. ఇక మోరీ వంతెన కూలిపోయే స్థితిలో ఉందని అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికీ అధికారులు పట్టించుకో లేదని అంటున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోయినా పట్టించుకోలేదని అంటున్నారు. అధిక లోడుతో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, అందుకే వంతెన కూలిపోయిందని అంటున్నారు.
వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించి త్వరిత గతిన వంతెన అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ మార్గం గుండా రాకపోకలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోవటం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ త్వరగా దీనిపై స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications