మైలవరంలో గెలుపెవరిది..ఆ పార్టీవైపే మొగ్గు..?
ఏపీలో కీలక ఘట్టం ముగిసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల కోసం నేతలందరూ కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వైసీపీకి గుడ్ చెప్పిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకుని మరీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఇక వైసీపీ నుంచి బీసీ కులానికి చెందిన సర్నాల తిరుపతిరావు యాదవ్ బరిలో దిగారు.వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో అని మైలవరం నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ అనంతరం వచ్చిన అంచనాలు ,విశ్లేషణలు చూసుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ రెండోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన కచ్చింతంగా విజయం సాధించేవారని టీడీపీ నేతలు చెప్పడం ఇక్కడ విశేషం.టీడీపీ క్యాడర్ అంతా కూడా వసంత గెలుపు కోసం కృషి చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాంతో వసంత గెలుపు ఖాయమని ఆ పార్టీ చెబుతోంది.

అయితే వైసీపీ కూడా గెలుపు ఆశలను వదులుకోవడం లేదు. మహిళలు వృద్దులు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు వచ్చారని వారి ఓట్లు అన్నీ కూడా తమకే అని భావిస్తున్నారు.మైలవరంలో గౌడ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది. ఆ ఓటు బ్యాంకుపై వైసీపీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు బీసీ సామాజిక వర్గం కూడా తమకు కలసి వస్తుందని విశ్లేషించు కుంటున్నారు. రెడ్డిగూడెం, మైలవరం, జి. కొండురు మండలాలు వైసీపీకి అనుకూలంగా పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఇబ్రహింపట్నం, కొండపల్లి, గొల్లపూడి వంటి మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు వైసీపీకి మద్దతుగా ఉండగా, పట్టణ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపించారు. తటస్థ ఓటర్లు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి అండగా ఉంటారో చూడాలి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications