న్యూస్ రీడర్ బద్రికి నివాళులు, బాధలో సహోద్యోగులు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జిల్లాలోని ద్వారకా తిరుమల సమీంలో కారు టైర్ పేలి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయన భార్యా పిల్లలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కుమారుడు కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం బద్రి అంత్యక్రియలు ఆయన సొంతూరు ఉంగుటూరులో ముగిశాయి.
బద్రి అంతిమయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మీసుజాతకు బంధువులు బద్రి మృతదేహాన్ని చూపించడంతో ఆమె బోరున విలపించారు. కాగా, బుధవారం నాడు సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బద్రికి పలువురు నివాళులు అర్పించారు.
నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ దృశ్యం.
నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ, రుద్రరాజు పద్మరాజు, పరకాల ప్రభాకర రావుల దృశ్యం.
నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సహోద్యోగులు.
నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పించిన అనంతరం అల్లం నారాయణ, రుద్రరాజు పద్మరాజు, పరకాల ప్రభాకర రావుల దృశ్యం.
నివాళులు
ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ 9 న్యూస్ రీడర్ బద్రికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ దృశ్యం.