ఢిల్లీలో ప్రత్యేక హోదా రగడ: రాష్ట్రపతికి మొర, మేం సమర్థిస్తాం: పవార్
న్యూఢిల్లీ: ఏపీకి తక్షణం ప్రత్యేక హోదాను ప్రకటించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నోటీసులు ఇచ్చింది. ఈ ఉదయం లోకసభలో ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, రాజ్యసభలో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్లు నోటీసులు ఇచ్చారు.
పార్లమెంటు సాక్షిగా తీసుకున్న నిర్ణయాలు, నెరవేరుస్తామని ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కదలాలని వారు డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పెద్దలను కలిసి చర్చించారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రపతిని కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానిని నెరవేర్చాలని వారు కోరనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సమర్థిస్తాం: శరద్ పవార్
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండును సమర్థిస్తామని శరద్ పవార్ చెప్పారు. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, కాబట్టి గత ప్రభుత్వాల నిర్ణయాలు ప్రస్తుత ప్రభుత్వం గౌరవించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాము సమర్థిస్తామని చెప్పారు. విభజన సమయంలోనే ఏపీకి హోదాపై కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications