వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బాబూ! సోనియా, రాహుల్‌ను చంపేయాలని ఉద్దేశ్యమా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు యాదవ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డిలు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను చంపినట్లే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలను చంపేయాలని బాబు ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఓ ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రాంతం పైన అభిమానం ఉంటే ఆ పార్టీ నుండి వెంటనే బయటకు రావాలని సూచించారు.

లేదంటే చంద్రబాబును హైదరాబాదు నుండి వెలివేయాలన్నారు. చంద్రబాబు చేసిన తమ నాయకుల పైన చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే కేసులు పెడతామన్నారు.

కాగా చంద్రబాబు నాయుడు ఓ పఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ ఓట్ల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. శ్రీలంక తమిళులకు సంబంధించి ఘటనలో రాజీవ్ గాంధీ, సిక్కుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారని బాబు అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెసు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Congress Party MLCs on Friday fired at Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X