తెలంగాణ నుంచి హామీ ఇస్తున్నా!: ఏపీకి ప్రత్యేకహోదాపై సోనియా గాంధీ ప్రకటన
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తెలంగాణను ఏర్పాటు చేస్తూనే, ఏపీ ప్రజలు కూడా బాగుండాలని తాము నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పారు.
ఏపీ ప్రజలకు తాను ఈ వేదిక నుంచి వాగ్ధానం చేస్తున్నానని, ఆనాడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ఏపీ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలను బాగుండాలనేది తమ కోరిక అన్నారు.
చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ వేదిక నుంచి మాట్లాడుతున్నా, కాంగ్రెస్తో కలుద్దామని నేనే చెప్పా: ఎల్ రమణ
ఏపీకి ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ముఖ్యమంగా ప్రత్యేక హోదా కూడా అన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. కానీ చట్టం చేయలేదు. దీంతో బీజేపీ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈసారి తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గత కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఇఫ్పుడు సోనియా కూడా చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పడం, దానికి తోడు కేంద్రంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం, బీజేపీయేతర పార్టీల ఏకీకరణ కోసం ప్రయత్నాలు చేస్తన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాహుల్ గాంధీతో చేతులు కలిపారు.