చెప్పుతో దాడి: రాజమండ్రిలో కానిస్టేబుళ్ల ధర్నా..!
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అగ్నిమాపక శాఖకు చెందిన కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. ఇటీవలే అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్గా ఎంపికై శిక్షణ పొందుతున్న యువకుడిపై అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ చెప్పుతో దాడి చేశారు.
ఈ దాడికి నిరసనగా కానిస్టేబుళ్లు ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్గా ఎంపికైన రెడ్డి అనే యువకుడు అమలాపురంలో శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణలో భాగంగా ఈత కొట్టేందుకు గాను 100 మందితో కలిసి అతడు రాజమండ్రికి వచ్చాడు.
రాజమండ్రిలో అడిషనల్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్గా పని చేస్తున్న కృపావరం.... రెడ్డిపై దాడి చేసి చెప్పుతో కొట్టాడు. దీంతో ఈత శిక్షణ కోసం రాజమండ్రికి వచ్చిన రెడ్డి తోటి కానిస్టేబుళ్లు కృపావరం దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజమండ్రిలో పూజారుల ఆందోళన
ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జిల్లా రాజమండ్రిలో దేవాదాయశాఖ పూజారులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే పుష్కరాల విధులను బహిష్కరిస్తామని పూజారులు హెచ్చరించారు.