ఏపీలో 40 మంది సూపర్ స్ప్రెడర్ల ద్వారా 300 మందికి కరోనా...తాజా నివేదికలో షాకింగ్ నిజాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా జరిగింది, ఇప్పటివరకూ దాదాపు 2 వేల మందికి పైగా బాధితులు కావడానికి వెనుక గల కారణాలేంటి అన్న అంశాలపై ప్రభుత్వం జరిపిన సమగ్ర పరిశోధనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇందులో కేవలం 40 మంది ద్వారా ఏకంగా 300 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరిని సూపర్ స్ప్రెడర్లుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
Recommended Video

40 మంది నుంచి 300 మందికి వ్యాప్తి..
ఏపీలో వివిధ కారణాలతో ఆరంభ దశలో కరోనా రోగులుగా నిర్ధారణ అయిన 40 మంది నుంచి ఏకంగా 300 మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు తాజాగా ప్రభుత్వం జరిపిన పరిశోధనలో తేలింది. ఈ 40 మంది విదేశాల నుంచి వచ్చినవారితో పాటు ఢిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా ఆరంభ దశలో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి పోవడం వల్ల వైరస్ వ్యాపించింది. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు లాక్ డౌన్ లోనూ ఇతరుల ఇళ్లకు వెళ్లి మరీ కరోనా వ్యాపింపజేసిన సందర్భాలూ ఉన్నాయి.

ప్రధాన సూపర్ స్పెడర్లు వీరే...
కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్ సోకింది. కృష్ణాజిల్లాలో ఒకరి నుంచి 18 మందికి సోకింది. అలాగే గుంటూరు జిల్లాల్లోనూ ఒకరి నుంచి 17 మందికి వైరస్ వ్యాపించింది. ఇదే జిల్లాలో పలువురు వ్యక్తులు కనీసం ఐదుగురి నుంచి 15 మందికి కరోనా మహమ్మారిని అంటించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాలైన అనంతపురం, తూర్పుగోదావరిలో ఒక్కొక్కరి నుంచి 12 మంది వరకూ వైరస్ పాకింది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 10 మందికి వైరస్ వ్యాపించింది.

80 శాతం మందికి లక్షణాలే లేవు...
ప్రధానంగా కరోనా వైరస్ సోకిన బాధితుల నుంచి వైరస్ వ్యాపించిందని భావించిన వారిలో లేదని తేలడం ఇక్కడ మరో విశేషం. ఉదాహరణకు ఢిల్లీ మర్కజ్ నుంచి భారీ సంఖ్యలో జనం తిరిగొచ్చిన జిల్లాల్లో కేసుల సంఖ్య ఇప్పటికీ రెండంకెలు దాటలేదు. అంటే రోగుల నుంచి వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ సోకలేదని తేలింది. రాష్ట్రం మొత్తం మీద చూస్తే రోగుల నుంచి 80 శాతం మంది ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ సోకలేదని తేలడం మరో విశేషం.
-
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications