టిడిపి నేత ఇంట్లో క్రికెట్ కిట్స్, మద్యం బాటిళ్ల సీజ్
చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి అక్రమంగా తరలిస్తున్న పదివేల మద్యం బాటిళ్లను మంగళవారం అటవీ ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజుల పాడ్యం సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మద్యం లోడ్తో ఉన్న లారీ తారపడింది. పోలీసులను చూసిన డ్రైవర్ లారీని వేగంగా చిత్తూరుకు వైపుకు తరలించాడు. దీన్ని గుర్తించిన పోలీసులు లారీని వెంబడించి పాతకాల్వ వద్ద పట్టుకున్నారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.65 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ చెప్పారు. మంగళవారం ఉదయం వరంగల్లో జిల్లా కలెక్టరేట్లో ఈవీఎంలు భద్రపరిచే కార్యాలయాన్ని భన్వర్లాల్ ప్రారంభించారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పిస్తామని, రాష్ట్రానికి 352 కంపెనీల బలగాలు వచ్చాయని ఆయన తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు భన్వర్లాల్ వెల్లడించారు.