విజయవాడలో ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ కఠినతరం ... రీజన్ ఇదే
కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇక నేడు ఏపీలో కొత్తగా మరో 12 కేసులు నమోదు కాగా 161కు బాధితుల జాబితా చేరింది . ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు . ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటున్నారు.
మొదట అక్కడక్కడ నమోదైన కరోనా కేసులు గత రెండు మూడు రోజుల్లో ఊహించని విధంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో ముఖ్యంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని కఠినం గా అమలు చెయ్యాలని భావిస్తున్నారు. విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. బెజవాడలో ఇప్పటి వరకు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు . దీంతో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త పేట ఇలా నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవసరం అయినా హెల్ప్ లైన్ ను సంప్రదించాలని, బయటకు మాత్రం రావద్దు అని చెప్తున్నారు పోలీసులు . ఇక కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని కమిషనర్ చెప్పారు. అంతే కాదు మూడు కిలోమీటర్ల పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇక ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు .
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!











Click it and Unblock the Notifications