ఎవరు నచ్చుతారు, నేను హీరోను, గెలుస్తా!: జగన్ ఆసక్తికరం, 'వైసీపీకి 137 స్థానాలు'
తాను విలన్ పైన పోరాటం చేస్తున్న హీరోను అని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Recommended Video

కర్నూలు: తాను విలన్ పైన పోరాటం చేస్తున్న హీరోను అని, వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.
జగన్ చేప్టిన యాత్ర బుధవారం 200 కిలో మీటర్లకు చేరుకుంది. డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో ఈ మైలు రాయి అందుకుంది. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, యువత తరలి వస్తున్నారు.

బాబు ప్రభుత్వం పతనం ఖాయం
పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు హామీలు ఇస్తున్నారు. బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే రేషన్ కార్డుపై 9 సరుకులు ఇస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పతనం కావడం ఖాయమన్నారు.

137 స్థానాల్లో వైసీపీ విజయం
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 137 స్థానాల్లో విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ, తెస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.

నాకు వచ్చి చెబుతున్నారు, ఎంతో వ్యతిరేకత
పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి నవరత్నాల్లో మార్పులు చేసి ఎన్నికల మేనిఫెస్టోను రెండు మూడు పేజీల్లో విడుదల చేస్తానని జగన్ చెప్పారు. మీడియా మిత్రులు సలహాలు ఇవ్వవచ్చునన్నారు. నిరుద్యోగులు, యువత, మహిళలు నేరుగా నా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారని, అంటే ఏ మేర ప్రజా వ్యతిరేకత ఉందో తెలుసుకోవచ్చునని చెప్పారు. బాబు ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు.

హీరోనే నచ్చుతాడు, నేను గెలుస్తా
మీరు సినిమాకు వెళ్తే అబద్దాలు చెబుతూ, వెన్నుపోట్లు పొడుస్తూ, అన్యాయాలు, అక్రమాలు చేసే విలన్ మీకు నచ్చుతాడా లేక వాటిని ఎదుర్కొనే న్యాయంగా ఉండే హీరో నచ్చుతాడా అని జగన్ ప్రశ్నించారు. మనకు అన్యాయాన్ని ఎదిరించే హీరో నచ్చుతాడన్నారు. రాబోయే ఎన్నికల్లో హీరోలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. వైసీపీని గెలిపించాలన్నారు. తాను సీఎంను అవుతానని చెప్పారు. తద్వారా తాను చంద్రబాబు అనే విలన్ పైన పోరాడుతున్న హీరోను అని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు.

మంచిగా పాలించి 2024లో మళ్లీ మీ ముందుకు వస్తా
ప్రజల ఆదరాభిమానాలతో ఏడాదిలో పాలన పగ్గాలు చేపడతామని, వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను తప్పకుండా అమలు చేస్తామని జగన్ చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలనను అందించి తిరిగి 2024 ఎన్నికలకు ప్రజల ముందుకు వస్తామన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications