ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు (ఫోటోలు)
అమరావతి: ఓ తండ్రి కన్నీటి గాథ ఇది. ఇంటి నుంచి పారిపోయిన తన కుమారుడికి కన్న తండ్రే అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు నాలుగు రోజుల తర్వాత కొడుకు మృతదేహం లభ్యం కావడంతో ఆ తల్లిదండ్రులకు దుంఖం కట్టలు తెంచుకుంది. పున్నమి నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కుమారుడికి తమ చేతులతో అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ వారి కన్నీటి రోదనతో ఆ ప్రాంతం హోరెత్తింది.
ఇంటి నుంచి పారిపోయి వచ్చింది ఇందుకా... కొడుకా అంటూ తల్లిదండ్రులు, సోదరుడు విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అశ్రునయనాల మధ్య జనార్దన్ మృతదేహానికి శ్మశానవాటకిలోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బాధతో స్వగ్రామం బయల్దేరారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
వివరాల్లోకి వెళితే.... గత నెల 29న అర్ధరాత్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లై ఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా దంతేరుకు చెందిన నక్కా జనార్ధన్ మృతి చెందాడు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
పరిహారం కోసం ఆశపడి నంది అప్పారావు అనే వ్యక్తి పోలీసులను మభ్యపెట్టి జనార్ధన్ శవాన్ని తీసుకుపోయి ఖననం చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మృతదేహం ఇప్పించాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
ఈ మేరకు గురువారం డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, డాక్టర్ రమణమూర్తి, టూటౌన్ సీఐ శ్రీనివాసరావు దగ్గరుండి బంధువుల సమక్షంలో మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
మృతదేహాన్ని పూడ్చి పెట్టి నాలుగు రోజులవడంతో పూర్తిగా పాడైపోయింది. దీంతో వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు అక్కడే పూర్తి చేసి పుట్టుడు దుఃఖంతో స్వస్థలానికి పయణమయ్యారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
గత సోమవారం ఐదు అనాథ శవాలు రావడంతో రెండు మృతదేహాలు ఒక గొయ్యిలో, మిగిలిన మూడు మృతదేహాలు మరో గొయ్యిలో పాతిపెట్టారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
దీంతో జనార్థన్ మృతదేహం ఏ గొయ్యిలో ఉందో తెలియలేదు. ఓ గోయ్యి పరిశీలించినా అందులో జనార్థన్ మృతదేహం లేకపోవడంతో దానిని పూడ్చి వేశారు.

ఓ తండ్రి కన్నీటి గాథ: ఎట్టకేలకు మృతదేహాన్ని అప్పగించారు
రెండో గొయ్యి తవ్వగా మూడు మృతదేహాలు కనిపించాయి. జనార్ధన్ మృతదేహం పైనే ఉండటంతో వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications