జగన్, బాబులపై ట్విట్టర్లో డిగ్గీ: ప్రధానికి లగడపాటి లేఖ
రాజకీయ లబ్ధి కోసమే జగన్, చంద్రబాబులు విభజన విషయంలో మాట మార్చారని మండిపడ్డారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాదులో విద్య, వైద్య అవకాశాలు కల్పిస్తామని, సీమాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీని ప్రకటిస్తామని చెప్పారు.
కాగా, రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాదు పైన అధికారం గవర్నర్కు లేదంటే కేంద్రం చేతిలో ఉంటుందని దిగ్విజయ్ సింగ్ ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. విభజన అంశం రెండుసార్లు శాసన సభకు వెళ్తుందని చెప్పారు. తొలుత ముసాయిదా తీర్మానం, ఆ తర్వాత బిల్లు ముసాయిదా సభకు వెళ్తాయన్నారు. రాబోయే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని, ఈ పదేళ్లలో హైదరాబాద్ పాలన గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రం కాబోదని స్పష్టం చేశారు.
ప్రధానికి లగడపాటి లేఖ
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు సోమవారం లేఖ రాశారు. విభజనపై కేబినెట్ నోట్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. 33 మంది ఎంపీలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దన్నారు. విభజనపై ఏకాభిప్రాయం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.