శ్రీశైలం మల్లన్న ఆలయంలో డ్రోన్ల కలకలం .. అలెర్ట్ అయిన పోలీసులు, నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత నాలుగు రోజులుగా శ్రీశైలం ఆలయం చుట్టూ తిరుగుతున్న డ్రోన్లు ఆలయ అధికారులకు టెన్షన్ పుట్స్తున్నాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని శ్రీశైలాంను 'నో ఫ్లై' జోన్గా ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.

శ్రీశైలం ఆలయంపై డ్రోన్లు సంచారం .. రంగంలోకి పోలీసులు
ఆలయం సమీపంలో ఆకాశంలో సంచరిస్తున్న ఈ డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం ,ఇతర ప్రదేశాల చిత్రాలను తీయడానికి దాదాపు మూడు డ్రోన్లు అనేకసార్లు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా, ప్రసిద్ధ ఆలయం మీదుగా అనుమానాస్పద వస్తువు కదులుతున్నట్లు మరియు డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు అలర్ట్ అయ్యారు.

నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
నల్లమల అటవీ ప్రాంతంలో,అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు డ్రోన్లని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో డ్రోన్లు ఎక్కడినుంచి వచ్చాయి? వీటిని ఎగురవేసింది ఎవరు? వీటి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? అన్న విషయాలపై దృష్టి పెట్టిన పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్లు ఎగరవేసిన వారి కోసం గాలింపు చేపట్టారు. అలర్ట్ అయిన పోలీసులు శ్రీశైలం పుణ్యక్షేత్రం లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు .

డ్రోన్లు తిరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈవో కె. ఎస్. రామారావు
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి కె. ఎస్. రామారావు ఈ వ్యవహారంపై మాట్లాడారు. ఆలయ ప్రాంతం నుండి అడవిలోకి కదులుతున్న డ్రోన్లు చూశామని, వెంటనే పోలీసులు మరియు అటవీ అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అయితే, ఆలయం మరియు దాని పరిసరాలపై డ్రోన్లను ఉపయోగించి చిత్రాలను తీయడానికి తాము ఇప్పటివరకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని వారు చెప్పారు. టైగర్ రిజర్వ్ జోన్లో జంతువుల కదలికలను కనుగొనడానికి ఈ డ్రోన్ను ఎవరైనా ఉపయోగించారా అన్నది తెలియాల్సి ఉందని ఆయన అంటున్నారు.
Recommended Video

నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని వీహెచ్పీ, బీజేపీ డిమాండ్
చిన్న చిత్రనిర్మాతలు లేదా పర్యాటకులు లేదా కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ కూడా తమకు కావాల్సిన ఫుటేజ్ కోసం డ్రోన్లను నిర్వహిస్తున్నట్లుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వి. రమణఈ విషయంపై తమకు ఆలయ అధికారుల నుండి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారు డ్రోన్లను గమనించిన వెంటనే, వారు పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాప్ రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా హిందూ ఆలయాలపై దాడులకు తెగబడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ను ప్రభుత్వం 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications