వేలం: 27కిలోల గణపతి లడ్డూకు రూ.2,12,000(ఫొటో)
విశాఖపట్నం: ఆ వినాయకుడి లడ్డూ విశాఖపట్నం జిల్లాలోనే అత్యధిక వేలం ధరను పలికింది. గాజువాకలో వినాయకుడి వద్ద పెట్టిన 8 టన్నుల భారీ లడ్డూతో పోల్చితే చాలా తక్కవ.. అంటే 27కిలోల బరువే అయినప్పటికీ రూ. 2,12,000ల వేలం ధర పలికింది. స్టిబిఎల్ గేటుడ్ కమ్యూనిటీలకు చెందిన వారు, దువ్వాడ కాలనీకి చెందిన 15మంది కలిసి ఈ గణపతిని కొలువుదీర్చారు. ఆ మండపంలోని 27కిలోల లడ్డూకు వేలంపాట పాడారు.
జిల్లాలో ఇంత భారీ ధర పలికిన లడ్డూ ఇదే కావడం గమనార్హం. గతంలో కూడా ఈ లడ్డూకు భారీ వేలంపాటే పలికింది. నిరుడు పెట్టిన లడ్డూను రూ. 1,72,000లకు కెఎల్ గాంధీ, ఇంద్రసేనారెడ్డిలు కైవసం చేసుకున్నారు. ఆయన ప్రసాదం దక్కించుకోవడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందని వారు తెలిపారు. స్వామివారి ప్రసాదంతో తమకు మంచి జరిగిందని చెప్పారు.

తాము కొనుగోలు చేసిన ప్రసాదాన్ని బంధువులకు, స్థానికులకు పంచామని వారు తెలిపారు. దీంతో తమ వ్యాపారాలకు లాభాలు చేకూరాయని చెప్పారు.
కాగా, ఈ సారి 15మందితోపాటు జి మహేష్ అనే వ్యక్తి 27కిలోల భారీ లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయకుడు అంటే తనకు అమితమైన విశ్వాసమని మహేష్ తెలిపారు. ప్రసాదాన్ని తమ కుటుంబసభ్యులతోపాటు స్థానికులకు పంచుతామని తెలిపారు. వేలంపాటలో వచ్చిన సొమ్మును వచ్చే ఏడాది వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహకులు చెప్పారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications