ప్రేమ, పెళ్లి పేరుతో మోసం: నీలి చిత్రాల్లో నటించాలని వేధింపు!
హైదరాబాద్: తన ఫోటోలను ఫేస్బుక్లో పెట్టి పరువు తీస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని యాకుత్పుర బాగేజహారాకు చెందిన ఇరవై నాలుగేళ్ల మహిళ తన మాజీ భర్త పైన మంగళవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రేమించానని నమ్మించి, పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నీలి చిత్రాల్లో నటించాలని భార్యను వేధించాడు. చివరికి విడాకులు తీసుకున్నా వేధింపులు ఆపలేదు. దీంతో ఆ యువతి పోలీసులు ఆశ్రయించారు. తనను వేధిస్తున్న మాజీ భర్త, అత్తమామల బారి నుంచి కాపాడాలంటూ ఆ యువతి వేడుకున్నారు.
యాకుత్పురకు చెందిన 24 ఏళ్ల యువతికి పాతబస్తీకి చెందిన సయ్యద్ అబ్దుల్ రబ్తో 2006లో పరిచయమైంది. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న అతను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ ఇద్దరూ కలుసుకునేవారు. ఈ తరుణంలో యువతిని 2012 అక్టోబర్ 8న గోల్కొండలో ఉన్న ఓ రిసార్ట్కు తీసుకెళ్లి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మత్తు నుంచి తేరుకున్నాక బాధితురాలు నిలదీయంతో 2014 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. డిసెంబరులో విడాకులు తీసుకున్నారు. అనంతరం అతను కువైట్కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్ చేసి వాట్సప్ ద్వారా తన స్నేహితునికి ఆమె నగ్న చిత్రాలను పంపమని వేధించడం మొదలు పెట్టాడు. దీనికి ఆమె నిరాకరించడంతో వేధింపులు ఎక్కువయ్యాయి.
ఆమె మామ సైతం ఆమె భర్తతో శారీరకంగా కలిసినప్పుడు తీసిన వీడియో చిత్రాలను బయటపెడతామని వేధించేవాడు. ఈ క్రమంలో తన ఫోటోలను ఫేస్బుక్లో పెట్టినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. ఆ చిత్రాలు బయటకు రాకుండా ఉండాలంటే నీలిచిత్రాలు తీయడానికి అంగీకరించాలని మామ, అత్త, మరిది, అతని భార్య ఒత్తిడి చేసేవారు. తాను తన భర్తతో కలిసి ఉన్నప్పటి వీడియోలు వారి వద్ద ఉన్నాయని, వాటిని బయట పెడతామని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.