మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత సునీత కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. కొండన్న మృతితో పరిటాల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొండన్న మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సంతాపం తెలిపారు. పరిటాల సునీత కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న మృతి తీరనిలోటు అని నారా లోకేశ్ అన్నారు. కొండన్న ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. సునీత, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా పరిటాల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

Recommended Video
నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్గా కొండన్న సుదీర్ఘకాలం పనిచేశారు. అనంతపురం జిల్లాలో ఎక్కువమంది సందర్శించే ఆలయాల్లో ఇదీ ఒకటి. ఆలయ ప్రాంతాన్ని అభివృద్ది చేసి, మంచి పేరు సంపాదించారు. ఆలయం పురాతనమైన... పరిటాల కుటుంబం మాత్రం మరింత అభివృద్ది చేయగా.. అమలు చేసింది మాత్రం ధర్మవరపు కొండయ్యే అని స్థానికులు చెబుతుంటారు.
టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత గారి తండ్రి శ్రీ కొండన్న గారు మృతి చెందటం బాధాకరం. సునీత గారి కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న గారి మరణం పరిటాల కుటుంబానికి తీరనిలోటు. (1/2) pic.twitter.com/0Vdia1UUV2
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 25, 2020
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సునీత గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. (2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 25, 2020












Click it and Unblock the Notifications