వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిద్రమాత్రలు: కన్న తండ్రే కాలయముండై కాటేశాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Fathers kills daughters in Prakasam district
హైదరాబాద్: కన్న తండ్రే వారి పాలిట కాలయముడై కాటేశాడు. తన కన్నబిడ్డలను చేజేతులా చంపేశాడు. పండ్ల రసంలో నిద్రమాత్రలు కలిపి పిల్లలను హతమార్చాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీనగర్‌లో చోటు చేసుకుంది.

చిన్నారికట్ట వెంకటేష్ నగరంలోని ఓ టీ దుకాణంలో పనిచేస్తూ గాంధీనగర్ నాలుగో వీధీలో తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేస్తున్న దుకాణం నుంచి వస్తూ నూడిల్స్, పండ్ల రసం తీసుకొచ్చాడు. భార్యకు తెలియకుండా పండ్ల రసంలో నిద్రమాత్రలు కలిపాడు.

ఆ పండ్ల రసాన్ని కుమారుడు ధర్మాసాయి (4), శ్రీనివాసు (11 నెలలు)లకు తాగించాడు. పండ్ల రసం తాగిన చిన్నారులిద్దరూ మరణించారు. ఈ ఘటనతో తల్లి హృదయవిదారకంగా రోదించింది.

ఇదిలావుంటే తూర్పు గోదావరి జిల్లా గోపవరం మండలం గుమ్మలదొడ్డిలో కట్టుకున్న భార్యపైనే ఓ భర్త యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

భర్త తనను మద్యం సేవించి వచ్చి వేధిస్తుండడంతో భార్య ఆరు నెలలుగా విడిగా ఉంటోంది. ఈ స్థితిలో ఆమెపై అతనికి అనుమానం కలిగిందని, దాంతో దాడికి పూనుకున్నాడని చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లె మండలం కొండసానిపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, మరిది పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.

English summary
A man has killed his two sons giving sleeping pills mixed juice at Ongole in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X