నిద్రమాత్రలు: కన్న తండ్రే కాలయముండై కాటేశాడు
చిన్నారికట్ట వెంకటేష్ నగరంలోని ఓ టీ దుకాణంలో పనిచేస్తూ గాంధీనగర్ నాలుగో వీధీలో తన భార్య ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. తాను పనిచేస్తున్న దుకాణం నుంచి వస్తూ నూడిల్స్, పండ్ల రసం తీసుకొచ్చాడు. భార్యకు తెలియకుండా పండ్ల రసంలో నిద్రమాత్రలు కలిపాడు.
ఆ పండ్ల రసాన్ని కుమారుడు ధర్మాసాయి (4), శ్రీనివాసు (11 నెలలు)లకు తాగించాడు. పండ్ల రసం తాగిన చిన్నారులిద్దరూ మరణించారు. ఈ ఘటనతో తల్లి హృదయవిదారకంగా రోదించింది.
ఇదిలావుంటే తూర్పు గోదావరి జిల్లా గోపవరం మండలం గుమ్మలదొడ్డిలో కట్టుకున్న భార్యపైనే ఓ భర్త యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
భర్త తనను మద్యం సేవించి వచ్చి వేధిస్తుండడంతో భార్య ఆరు నెలలుగా విడిగా ఉంటోంది. ఈ స్థితిలో ఆమెపై అతనికి అనుమానం కలిగిందని, దాంతో దాడికి పూనుకున్నాడని చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలోని నిమ్మనపల్లె మండలం కొండసానిపల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఓ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, మరిది పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.