తండ్రి: 1956ముందు వారికే ఫీజు రీయింబర్స్మెంట్స్!
హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి 1956 సంవత్సరమే ప్రామాణికం కానుంది. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హులు కానున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు లేదా మూడు రోజుల్లో విడుదల కానున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం సంక్షేమ, విద్యా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా విద్యార్థుల స్థానికతపై సుదీర్ఘంగా చర్చించారు. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హతగా నిర్ణయించే విద్యార్థుల స్థానికతకు 1956వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికతను నిర్థారించడానికి మండల స్థాయిలో ఎక్కడికక్కడ కమిటీలను ఏర్పాటు చేయాలని, లోకల్ సర్టిఫికెట్లను మీ సేవా కేంద్రాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం పేరిట ఫీజు పథకాన్ని ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications