అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాచర్ల మంటలు ఆరకుండానే 'మరో మంటలు'?

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘటన కలకలం రేకెత్తించింది. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్న అన్న క్యాంటీన్ భవనంలో మంటలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే మంటల్ని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నసమయంలో అన్న క్యాంటిన్ అదే భవనంలో ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూతపడింది. ఒకవైపు మాచర్లలో టీడీపీ-వైసీపీ మధ్య మంటలు రేగుతునన సమయంలో ఈ భవనానికి మంట పెట్టింది ఎవరు? అనే విషయం తేలాల్సి ఉంది.

వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తుండగా.. టీడీపీ వారే మంటలు పెట్టుకొని వైసీపీపై బురద చల్లుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టి ఉంటారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

fire accident in tenali anna canteen

అన్న క్యాంటిన్లను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి రోజుల్లో ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తర్వాత అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలనుకుందికానీ ఓటమిపాలవడంతో అన్న క్యాంటిన్లు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకులు తమ సొంత ఖర్చుతో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులకు, వైసీపీ నాయకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తెనాలిలో అన్న క్యాంటిన్ కు నిప్పు పెట్టిన ఘటనలో పూర్తి వివరాలు బయటకు వస్తేకానీ అసలు విషయాలు వెల్లడికావు.

English summary
A fire broke out in the vacant Anna canteen building near the Tenali Municipal Corporation office, causing the locals to panic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X