వారి కోసం .. నిన్న అసోం సీఎంతో .. ఇప్పుడు గుజరాత్ సీఎంతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మత్స్యకారుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్కు ఫోన్ చేసిన సీఎం జగన్ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఫోన్ చేశారు . గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకారుల లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించిన సీఎం జగన్ తాజాగా చేపల ఎగుమతికి అనుమతిని ఇవ్వాలని , అడ్డంకులను తొలగించటానికి దృష్టి పెట్టాలని అసోం సీఎంతో మాట్లాడారు .
ఇక ఇదే క్రమంలో గుజరాత్ సీఎంతో కూడా జగన్ మత్స్యకారుల గురించి మాట్లాడారు . పొట్టకూటి కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా అక్కడ ఏపీ మత్స్యకారులు చిక్కుకున్నారని, ఆహారం , నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ఫోన్ చేసిన జగన్ ఆయనతో కరోనా పరిస్థితుల గురించి మాట్లాడారు . అక్కడి తెలుగు మత్స్యకారుల అంశం కూడా మాట్లాడిన ఆయన వారికి అండగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు .

ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇక సీఎం జగన్ గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ సీఎం విజయ్రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని , వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని చేసిన విన్నపం మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని ట్వీట్ చేశారు .మొత్తానికి సీఎం జగన్ మత్స్య కారుల కోసం తీసుకుంటున్న చొరవతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications