చంద్రబాబు ముగ్గురు బిడ్డల పథకంపై మాజీ ఫ్రెండ్ పంచ్ లు..!
ఏపీలో జనాభా పెంచేందుకు వీలుగా ప్రజలంతా ముగ్గురు పిల్లల్ని కనాలంటూ సీఎం చంద్రబాబు (Chandrababu)తెస్తున్న విధానంపై మాజీ కేంద్రమంత్రి, ఆయన మాజీ స్నేహితుడు కూడా అయిన చింతా మోహన్ (chinta mohan) మండిపడ్డారు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఉద్యోగులకు అదనపు సెలవులు ఇస్తామని, అలాగే 25 వేల ప్రోత్సాహకం ఇస్తామని చంద్రబాబు నిన్న చేసిన ప్రకటనపై చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన సమస్య ఏంటో చెప్పాలన్నారు.
నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీనిపై స్పందించిన చింతా మోహన్.. ఆయన మాత్రం ఒక బిడ్డనే కంటాడు, ఇతరుల్ని మాత్రం ముగ్గురు బిడ్డల్ని కనమని ఎలా చెప్తాడని ప్రశ్నించారు.

అలాగే ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సైతం ఒక బిడ్డనే కంటాడని, అయినా చంద్రబాబు ఇతరులు ముగ్గురు బిడ్డలు కనాలని చెప్పడం విడ్డూరంగా ఉందని చింతా మోహన్ తెలిపారు. చంద్రబాబు తాను చేయని పనులు ఇతరులకు చెప్తుంటాడని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. ఒక్క బిడ్డనే పుట్టించిన చంద్రబాబు తెలివితేటలు తమకు కూడా ఉన్నాయన్నారు. ఇతరులకు ఏదైనా చెప్పేముందు ఆలోచించి చెప్పాలని తన మాజీ స్నేహితుడికి చింతా మోహన్ సలహా ఇచ్చారు. చంద్రబాబు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో ఎవరికీ అర్ధం కాదన్నారు.
-
నితీశ్ తర్వాత వికెట్ చంద్రబాబే? మాజీ కేంద్రమంత్రి జోస్యం..! -
వాళ్లు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు - పవన్ కీలక వ్యాఖ్యలు..!! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
YS Sharmila: బోడి 25 వేలకు మూడో బిడ్డను కనాలా ? చంద్రబాబుపై షర్మిల పంచ్..! -
ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
BREAKING: ఏపీలో సోషల్ మీడియా బ్యాన్- నిండు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
వైసీపీకి స్పీకర్ తాజా షాక్-త్వరలో నోటీసులు-జగన్ పై క్లారిటీ..! -
Botsa Satyanarayana: బొత్సకు మళ్లీ అస్వస్ధత-మండలిలో మాట్లాడుతూనే..! -
Kavitha: కవిత నోట 'జై ఆంధ్ర' నినాదం-తిరుపతిలో కీలక వ్యాఖ్యలు..! -
సీఎం పదవికి రాజీనామా! బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
తెలంగాణలో ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ..














Click it and Unblock the Notifications