విద్యార్థుల ఆత్మహత్యలు: కళాశాలలకు గంటా హెచ్చరిక
రాష్ట్రంలో గత కొంత కాలంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
విజయవాడ: రాష్ట్రంలో గత కొంత కాలంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తేలిందని ఆయన చెప్పారు.
పిల్లలను అంతగా ఒత్తిడికి గురిచేయవద్దని విద్యా సంస్థల యాజమాన్యాలను మంత్రి గంటా హెచ్చరించారు. ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడుతున్నామని తెలిపారు.

మీడియా కూడా విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సానుకూల సూచనలు ఇవ్వాలని మంత్రి గంటా కోరారు. కాగా, గత నెల రోజులల వ్యవధిలోనే రాష్ట్రంలో దాదాపు పది మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విషయ తెలిసిందే.












Click it and Unblock the Notifications