ఇంటర్ సెకండియర్: ఎపిలోనూ బాలికలదే హవా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్రావు ఫలితాలను కర్నూలులో విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల్లో మొత్తం 72.07 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే 1.19 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ అమ్మాయిల హవానే కొనసాగింది. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 74.80 కాగా, అబ్బాయిలు 69.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రతీ సంవత్సరంలాగే అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏబీసీడీ గ్రేడులుగా మార్కుల మెమోను ఇవ్వనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.

ఇంటర్ పరీక్షల్లో కృష్ణా జిల్లా(83 శాతం) మొదటి స్థానంగా నిలవగా, కడప జిల్లా(60 శాతం) చివరి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా ఏడో స్థానంలో(62శాతం) నిలిచింది. వచ్చే నెల 2 నుంచి కాలేజీల్లో మెమోలు ఇవ్వనున్నట్లు మంత్రి గంటా తెలిపారు.
మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు మే 5లోగా దరాఖాస్తులు చేసుకోవాల్సిందిగా మంత్రి చెప్పారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications