ప్రియుడి చేతులు నరికిన ప్రేయసి: షాపింగ్కు వెళ్లి మహిళ అదృశ్యం
హైదరాబాద్: మోసం చేసిన ప్రియుడి చేతులను ఓ ప్రియురాలు నరికింది. ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతి ప్రేమికుడి చేతులను నరికింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలు తన వెంట కత్తి తెచ్చుకుని దానితో అతన్ని పొడిచింది. గాయపడిన ప్రియుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
షాపింగ్కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాదులోని సుల్తాన్ బజారు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన శుక్రవారంనాడు వెలుగులోకి వచ్చింది. బేగంపేట రసూల్పురా కృష్ణానగర్కు చెందిన పి. బాలరాజు భార్య అనిత (30) తన బంధువులైన స్రవంతి, స్వాతి, మహేశ్వరిలతో కలిసి గురువారం కోఠీకి షాపింగ్ కోసం వెళ్లింది.
అయితే, మధ్యలో అనిత కనిపించలేదు. దీంతో వారు బాలరాజుకు సమాచారం అందించారు. భార్య సెల్కు అతను ఫోన్ చేశాడు. అది స్విచాఫ్ అయి ఉంది. భర్త తన బంధువులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి, తెలిసినవారిని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసుకున్నారు.