ఘోరం: బస్సు రంధ్రం నుంచి పడి బాలిక మృతి

దీంతో గోవిందమ్మ నారాయణపేటలో ఉన్న చెల్లెలు అనంతమ్మ దగ్గరకు తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. చెల్లెలు అనంతమ్మ అక్కకు నచ్చజెప్పి మక్తల్కు వెళ్లేందుకు గోవిందమ్మతో పాటు పిల్లలు నారాయణపేట ఎపి22డబ్ల్యు7471 నంబర్ గల బస్సులో బయలుదేరి వస్తుండగా డీజిల్ ట్యాంక్ మరమ్మతు గురైంది.
అయితే, కొద్దిరోజుల కిందట ట్యాంక్ మరమ్మతు చేసి సీటు కింద ఆ రంధ్రాన్ని మూయకుండా గోనె సంచిని వేశారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న గోవిందమ్మ రెండవ కూతురు స్వాతి (6) గోనె సంచిపై కాలు పెట్టడంతో ఆ రంధ్రంలో నుండి కిందకు జారిపడిపోవడంతో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications