పూజ పేరుతో వ్యాపారికి బురిడీ, 50 వేల బంగారు ఆభరణాలు మాయం
దొంగ స్వామి బారిన పడిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు యాభై వేల బంగారు ఆభరణాలను కోల్పోయాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
గుంటూరు:దొంగ స్వాములు, పూజారులు, బాబాల గురించి మోసపోయారంటూ ప్రతిరోజూ ప్రసార సాధనాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోన్నా నకిలీ స్వాముల బారిన పడి తమ విలువైన సొమ్మును, నగదును కోల్పోతూనే ఉన్నారు. ఈ తరహ ఘటన ఒకటి గుంటూరులో చోటుచేసుకొంది.
గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయాల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆభరణాలను దొంగ పూజారి మాయం చేశాడు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకుగాను ఓ పూజారిని పిలిపించాడు.

పూజలో కొంత బంగారాన్ని పెట్టాలని నకిలీ పూజారి సూచించాడు.ఈ మాటలను నమ్మిన వ్యాపారి శ్రీనివాస రావు పూజలో యాభైవేల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను పూజలో పెట్టాడు. కాసేపు పూజ చేస్తున్నట్టు నటించిన నకిలీ పూజారి ఆ బంగారు ఆభరణాలను తీసుకొన్నాడు.
పూజ పూర్తైందని చెప్పి నకిలీ పూజారి అక్కడి నుండి పారిపోయాడు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయాన్ని గ్రహించిన వ్యాపారి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications