ఏపీ, టీ కలిస్తేనే శక్తి, బంధుత్వం పెరుగుతుంది: గవర్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే శక్తి ఉంటుందని గవర్నర్ నరసింహన్న అన్నారు. జలవిహార్లో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్.. బలయ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. గత పదేళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ముందుకు సాగితే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలుగు ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్నారు. అలయ్ బలయ్తో బంధుత్వం పెరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తాము సహకరిస్తామని బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు వేణుగోపాల చారి, రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు హాజరయ్యారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications