విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో జంట హత్యలు: గంటల్లో చేధించిన పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Killed
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని సత్యనారాయణపురంలో సోమవారం ఉదయం జంట హత్యల కలకలం సృష్టించాయి. ఈ హత్యలకు సంబంధించి నగర పోలీసులు నిందితులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపురంలోని తారంకివారివీధిలో సోమవారం ఉదయం దుండగులు ఇంట్లో ఉన్న వృద్ధురాలి, మనవరాలిని గొంతు కోసి హత్య చేశారు.

వన్ టౌన్ శివాలయం వీధిలో బంగారం వ్యాపారం చేస్తున్న సత్యనారాయణకు ఇద్దరు కుమారులు. దసరా సెలవులు కావడంతో ఇద్దరు కుమారులు ఊరికి వెళ్లిన సమయంలో ఆగంతకులు సత్యనారాయణ భార్య పుణ్యవతి, రెండవ కుమారుడి కుమార్తె సాయి చంద్రికను గొంతు కోసి చంపేశారు.

ఈ కేసు విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాఫ్తును వేగవంతం చేశారు. డిసిపి రవి ప్రకాశ్ ఆధ్వర్యంలో దర్యాఫ్తు చేపట్టారు. డబ్బు, నగల కోసమే దుండగులు ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. కేసులో లిఫ్ట్ మెకానిక్‌ను ప్రధాన సూత్రదారుడిగా అనుమానిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాను డబ్బు కోసమే పుణ్యవతిని చంపానని, సాక్ష్యం లేకుండా చేసేందుకు చంద్రికను చంపినట్లు లిఫ్ట్ మెకానిక్ అంగీకరించాడు.

తల్లీ, కూతుళ్ల ఆత్మహత్య

పురుగుల మందు తాగి తల్లీ, కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చోటు చేసుకుంది. తల్లి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పిల్లలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

English summary
Grand mother and Grand daughter killed by unknown people in Vijayawada of Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X