రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు పర్యటనకు ముందు పుష్కరాల్లో తుపాకీ కలకలం, పడవలో బాంబు అని బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గౌతమి ఘాట్‌ మెట్లపై పోలీసులు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నారు. పుష్కరస్నానం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి రివాల్వర్‌ను మెట్లపై ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని గుర్తించారని తెలుస్తోంది. అతనిని విచారిస్తున్నారని సమాచారం.

ఇది పోలీసుల తుపాకీయేనా? ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా పెట్టారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చంద్రబాబు కొవ్వూరు పర్యటనకు వస్తున్నారు. ఈ సమయంలో తుపాకీ కలకలం చెలరేగడం గమనార్హం.

మరోవైపు, గోదావరి పుష్కరాల్లో మధ్యాహ్నం బాంబు కలకలం చెలరేగింది. వశిష్ట విఐపి ఘాట్ వద్ద గోదారిలో ప్రయాణించే బోటులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. పోలీసులు తనిఖీలు చేశారు. ఎలాంటి అపోహలు నమ్మవద్దని పోలీసులు సూచించారు.

కాగా, రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. విఐపిలు కూడా పుణ్యస్నానం ఆచరిస్తున్నారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు. వైయస్ రాజశేఖర రెడ్డికి పిండాలు పెట్టారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు. గోదావరికి హారతి ఇస్తున్న జగన్.

సాంస్కృతిక ప్రదర్శనలు

సాంస్కృతిక ప్రదర్శనలు

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి.

సాంస్కృతిక ప్రదర్శనలు

సాంస్కృతిక ప్రదర్శనలు

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో సాంస్కృతిక ప్రదర్శనల దృశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. ప్రదర్శనకారులతో చంద్రబాబు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పథకాల ప్రచార చిత్రాల ప్రదర్శన చేశారు. వాటిని చూస్తున్న యనమల.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పథకాల ప్రచార చిత్రాల ప్రదర్శన చేశారు. చూసేందుకు వస్తున్న ప్రజలు.

బోటింగ్

బోటింగ్

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు పుణ్యస్నానం ఆచరించడంతో పాటు బోటులో విహరిస్తున్నారు.

మంత్రులు

మంత్రులు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా మంత్రులు రావుల కిషోర్ తదితరులు భోజనం చేస్తూ...

English summary
Gun scare in Kovvur Gouthami Ghat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X