తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం: భారీ వర్షాలు, మత్స్యకారులకు హెచ్చరిక
విశాఖపట్నం: మరో రెండ్రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది దీంతో రానున్న 12గంటల్లో వాయుగుండంగా, అనంతరం తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ, మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి బుధవారం సాయంత్రం నుంచి గంటకు 45-55కిలోమీటర్ల వేగంతో, గురువారం నుంచి 65-75 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.

మత్స్యకారులు దక్షిణ బంగాళాఖాతం, ఒడిశా, అండమాన్, ఆంధ్రప్రదేశ్ తీరం రెండ్రోజులపాటు వెళ్లరాదని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications