తప్పు చేసింది, కిరణ్ మార్పు ఈజీ కాదు: టిజి వెంకటేష్
హైదరాబాద్: ముఖ్యమంత్రిని మార్చడం అంత సులువైన విషయం కాదని, ఇప్పటికే ఒక తప్పు చేసిన తమ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి మరో తప్పు చేస్తుందని తాము అనుకోవడం లేదని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు.
మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమయంలో వారు మాట్లాడారు. ఇప్పటికే అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకొని ఓ తప్పు చేసిందన్నారు. మరో తప్పు చేయదని తాను అనుకుంటున్నానని చెప్పారు. అయినా ముఖ్యమంత్రిని మార్చడం అంత సులువైన విషయం కాదన్నారు. ఊహాగానాల పైన స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ముఖ్యమంత్రి మార్పు తేలికైన విషయం కాదని ఏరాసు అన్నారు. ఆయనను మారుస్తూ ఎమ్మెల్యేల ఏకవ్యాఖ్య తీర్మానం ఉండదన్నారు. కిరణ్ రెడ్డిని మార్చుతామంటే అధిష్టానం నిర్ణయానికి ఎమ్మెల్యేలు ఓకే చెప్పారన్నారు.
రాయలసీమలో కొత్త రాజధాని: బైరెడ్డి
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమలో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు చాలని, లక్ష ఎకరాలు అవసరం లేదని ఆయన అన్నారు. నదీ జలాల పంపిణీలో సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియలో కిరణ్, చంద్రబాబు, జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications