Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో తొలి భారీశిల్పం,చారిత్రక స్మారకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో తొలి భారీ శిల్పాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు అమరావతిలో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని నేడు చంద్రబాబు ఆవిష్కరించారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తో సహా, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Historical Monument potti sriramulu 58 feet statue inaugurated by cm chandrababu in amaravati

శాఖమూరు పార్కులో 6.80 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అమరజీవి త్యాగ శిల్పం పేరుతో రూపొందించిన ఈ విగ్రహాన్ని, అమరావతి ప్రాంతంలోని శాఖమూరు పార్కులో మొత్తం 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.

ప్రాజెక్ట్ లో తొలిదశ పనులు పూర్తి

ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ను ఉపయోగించారు. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. ఈ ప్రాజెక్టుకు తొలిదశ పనులను పూర్తి చేసి శిల్పాన్ని ఆవిష్కరణ గావించారు. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసిన తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది.

అంగన్వాడీలకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త!
అంగన్వాడీలకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త!

చారిత్రక స్మారకంగా అమరజీవి విగ్రహం

ఈ ప్రాజెక్టు రెండవ దశలో మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుని చారిత్రక స్మారకంగా ఈ విగ్రహం నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాడు ఆంద్ర రాష్ట్రం కోసం కృషి చేసిన మహనీయుడికి సరైన గుర్తింపును ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+