విజయవాడ దుర్గా అగ్రహారంలో దారుణం-పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో నరికి హత్య
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నగరంలోని దుర్గా అగ్రహారంలో ఇవాళ ఓ యువకుడిని పలువురు ఆగంతకులు పట్టపగలే బైక్లపై వచ్చి నరికి చంపారు. దీంతో స్ధానికంగా ప్రజలు భయభ్రాంతులయ్యారు. మృతుడి వివరాల ఆధారంగా హంతకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో పట్టపగలే ఆగంతకులు చెలరేగిపోయారు. స్ధానికంగా ఉండే ఓ వ్యక్తిని రోడ్డుపై ఆపి అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో వారు వదిలి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు రంగంలకి దిగారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే స్ధానికంగా ఉన్న షాపులు, రోడ్లపై ఉన్నసీసీటీవీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరిస్తున్నారు.

విజయవాడ నగరం చాలా కాలంగా నేరాలు తగ్గుముఖం పట్టడంతో జనం ప్రశాంతంగా నివసిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ఉండగా.. తాజాగా వాటిని ఎత్తేశారు. దీంతో నిందితులు పక్కా ప్లాన్తోనే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాతకక్షలే ఈ దారుణ హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్ని పట్టుకునేందుకు నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిందితులు నగరం విడిచి పారిపోకుండా గాలింపు సాగిస్తున్నారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications