కెసిఆర్కు రేవంత్ సవాల్: కిషన్ ఫైర్, ఎవరోనని కెటిఆర్
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని... అమ్మ గుడి కట్టాలని చెబుతున్న కాంగ్రెసు నాయకులు ముందుగా తెలంగాణ కోసం అమరులైన పన్నెండుమంది సమాధులు కట్టి వాటి మధ్య ఆమె గుడి కట్టాలన్నారు. అమరుల సమాధుల మధ్య సోనియా గాంధీకి గుడి కడితే అమ్మ వారిని బలితీసుకుందని భవిష్యత్తు తరాలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
కెసిఆర్పై కిషన్ రెడ్డి నిప్పులు
మోడీ.. గీడీ అన్న కెసిఆర్ పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాము కెసిఆర్.. గీసిఆర్ అని కూడా అనవచ్చని ఎద్దేవా చేశారు. మోడీ లేరంటూ కెసిఆర్ మాట్లాడటం సరికాదన్నారు. ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో.. మోడీ ప్రధాని కావడం అంతే వాస్తవమన్నారు. మోడీకి ఓటు వేయవద్దని కెసిఆర్ చెప్పడమేమిటన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు.
ఎవరు కావాలి: కెటిఆర్
ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో మన రాష్ట్రం.. మన పార్టీ... మన పాలన నినాదంతో ముందుకు సాగాలని తెరాస ఎమ్మెల్యే కెటి రామారావు పిలుపునిచ్చారు. ఢిల్లీకి తల వంచేవాళ్లు కావాలా లేక ఢిల్లీ మెడలు వంచేవాళ్లు కావాలా ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అధిష్టానం ఫోన్ కాల్కే వణికిపోయే నాయకుల వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.