‘‘నన్ను అనరాని మాటలు అన్నారు, నా జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు’’
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో విపక్షనేత జగన్మోహన్రెడ్డి తనను అనరాని మాటలన్నారని, తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో విపక్షనేత జగన్మోహన్రెడ్డి తనను అనరాని మాటలన్నారని, తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
మంగళవారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్షాప్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... టీడీపీకి అండగా నిలబడిన నంద్యాల, కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
అలాగే నంద్యాలలో టీడీపీ ఓడిపోతుందని విషప్రచారం చేశారని, నంద్యాల, కాకినాడ ఫార్ములాను అన్ని చోట్ల అమలుచేయాలని ఆయన టీడీపీ నేతలకు ఉద్బోధించారు. అంతేగాక ప్రజల్లో అసంతృప్తి ఉన్నచోట కారణాలు అన్వేషించాలన్నారు.

రాబోయో సార్వత్రిక ఎన్నికలను పార్టీ కార్యకర్తలు సవాల్ గా తీసుకోవాలని, దైవాధీనంగా భావించవద్దని చంద్రబాబునాయుడు సూచించారు. బెజవాడలో వైసీపీ నేతలు గొడవపడి రోడ్డెక్కారని, తమ పార్టీ వెధవలను ప్రోత్సహించిందని వైసీపీ నేతలే అంటున్నారని చంద్రబాబు అన్నారు.
జగన్ లాంటి నాయకుడు ఉంటే అలాంటి నేతలనే ప్రోత్సహిస్తారని, నెల్లూరు, కాకినాడ బెట్టింగుల్లో ప్రతిపక్ష నేతలున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications