కాకినాడలో ఆయిల్ మాఫియా విజృంభణ...పలు పరిశ్రమల మూసివేత...తరలింపు
కాకినాడ: కాకినాడలో ఆయిల్ మాఫియా విజృంభణతో ఆయిల్ పరిశ్రమల యాజమాన్యాలు విలవిల్లాడుతున్నాయి. వారి ఆగడాలకు ఎలా అడ్డుకట్టవెయ్యాలో తెలియక ఏకంగా పరిశ్రమలే మూసేస్తున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
కాకినాడలో ఆయిల్ మాఫియా ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తరచూ ఆయిల్ దొంగతనాలు జరుగుతుండటం, పక్కా ప్లాన్ ప్రకారం భారీ స్థాయిలో ఆయిల్ దోపిడీలకు ఈ మాఫియా వ్యక్తులు తెగబడుతుండటంతో పాటు ఆయిల్ పరిశ్రమలో కొందరి గుత్తాధిపత్యం కారణంగా అనివార్యమవుతున్న నష్టాలు ఆయిల్ పరిశ్రమ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో కాకినాడలోని పెద్ద పెద్ద ఆయిల్ పరిశ్రమలే మూత పడుతుండగా, చాలా పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలివెళ్లిపోతున్నాయి.

దిగుమతులు దిగువకు...
కాకినాడలో గతంలో రెండు లక్షల టన్నుల వరకు ఎడిబుల్ ఆయిల్ దిగుమతి అయ్యేది. అయితే ఇప్పుడు ఇప్పుడు కేవలం 70 వేల టన్నుల ఆయిల్ మాత్రమే దిగుమతి అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పరిశ్రమల మూత...
వంట నూనెల తయారీకి సంబంధించి కాకినాడలో 11 ఆయిల్ పరిశ్రమలుంటే అందులో ఇటీవల కాలంలో ఆరు పరిశ్రమలు మూతపడ్డాయి. త్వరలో మరికొన్ని పరిశ్రమలు మూతపడే దశలో ఉన్నాయని స్థానిక ఆయిల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నియంత్రణా వైఫల్యం...
ఈ పరిస్థితికి ప్రధాన కారణం రవాణాలో ఆయిల్ మాఫియా ఆగడాలను నిలువరించలేకపోవడమేనని స్థానిక వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. సరుకుకు రవాణా భద్రత లేకపోవడంతో ఎగుమతి, దిగుమతి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ట్యాంకర్ల దోపిడీ ఆగడాలను భరించలేక పైపులైన్ల ద్వారా ఆయిల్ రవాణాను చేపట్టినా వాటికీ రంధ్రాలు పెట్టి దొంగిలించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రతా సిబ్బందిని పెట్టినా...
పైపులైన్లను కాపాడుకునేందుకు ఒక్కో ఆయిల్ కంపెనీ తరఫున ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించుకొని 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. అయినా ఈ గస్తీ బృందాలను సైతం మాఫియా లోబరుచుకోవడం, భయపెట్టడం ద్వారా వారి కార్యక్రమాలను యథేచ్చగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గడచిన 18 నెలల్లో చోరీకి గురైన ఆయిల్ అఫీషియల్ గా 20 టన్నులని అంటున్నారని, కానీ అంతకంటే ఎక్కువే పోయివుంటుదని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కాకినాడ గ్రామీణం పరిధిలో పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొదలు ఎప్పుడంటే...
సుమారుగా 2000 సంవత్సరం నుంచి కాకినాడలో ఆయిల్ మాఫియా ఆగడాలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రైవేటు పోర్టులొచ్చాక సరకు రవాణాలో ట్యాంకర్ల ఆధిపత్యం ఉండేది. దాన్నుంచి బయటపడేందుకు ఈ ప్రాంతంలో వంటనూనెల ఆయిల్ పరిశ్రమలను స్థాపించిన వ్యాపారవేత్తలు పైపులైన్ల ద్వారా ఆయిల్ రవాణాకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆయిల్ మాఫియా ఆగడాలు పెరగడం, యూనియన్ల గొడవల వ్యవహారాల్లో హత్యలు జరిగేంతవరకూ పరిస్థితి వెళ్లింది.

మాఫియాకు నేతల అండ...
ఇటీవల కాకినాడ రూరల్ పరిధిలో ఇలాగే పైపులైనుకు రంధ్రం చేసి ఆయిల్ చోరీ చేసిన ఘటనపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారట.
అయితే మాఫియాకు మద్దతుగా వెంటనే రాజకీయ నేతలు నేరుగా రంగంలోకి దిగి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ వ్యాపారులపై తీవ్ర ఒత్తిడి చేశారట. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితితో వ్యాపారులు బావురుమన్నారట. దీన్ని బట్టి ఆయిల్ మాఫియా ఇక్కడ ఎంతగా పాతుకు పోయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

పోలీస్ శాఖకు మచ్చలు...
పోలీసు శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ వివాదాల్లో తలదూర్చి మచ్చలు తగిలించుకున్నారు. నవంబర్ నెల 28న ఆయిల్ దొంగతనం ఇందుకో ఉదాహరణ. ఆరోజు కాకినాడలో జరిగిన ఆయిల్ దొంతనానికి సంబంధించి పోలీసులు కొంతమందిని అరెస్టు చూపించారు. అందులో పైపునకు రంధ్రం చేసిన వారిని, లారీ డ్రైవర్లను, సంపు స్టోరేజీ నుంచి అమ్మిన వారిని, ఆఖరికి సంపు స్టోరేజీ గోదాం అద్దెకిచ్చిన వ్యక్తిని కూడా అరెస్టు చేసిన పోలీసులు దొంగ ఆయిల్ కొనుగోలు చేసిన వ్యాపారిని మాత్రం వదిలేశారు. ఈ పరిణామం పోలీసుల విచారణ తీరుపై సందేహాలకు తావిచ్చింది. గతంలో జిల్లాలో పనిచేసిన ఎస్పీకి, మరో పోలీసు అధికారికి మధ్య ఆయిల్ కారణంగా తలెత్తిన వివాదం అప్పట్లో పోలీసు శాఖ ప్రతిష్ఠను బాగానే దెబ్బతీసింది.

కోట్ల రూపాయల ముడుపులు..
ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయిల్ మాఫియాలో తలదూర్చుతున్న పోలీసులకు ఆయిల్ మాఫియా, నేతలకు అందించే మామూళ్లు కోట్లనే ఉంటాయనే ప్రచారం ఉంది. 15-20 సంవత్సరాల నుంచి సాగుతున్నఈ వ్యవహారం మధ్యలో అప్పుడప్పుడు కొంత కాలం బ్రేక్ పడటం మినహాయించి నిరాటంకంగానే కొనసాగుతోందని చెప్పవచ్చు.

మూత..తరలింపు..
ఈ విధంగా ఆయిల్ మాఫియా ఆగడాలు భరించలేని స్థాయికి చేరుకోవడం, ఈ పరిస్థితి మారే అవకాశం కనుచూపుమేరలో కనిపించక పోవడంతో పలు ఆయిల్ పరిశ్రమల యజమానులు తమ సంస్థలను మూసేసుకుంటున్నారు. అలా మూత వెయ్యలేనివారు ఎక్కువగా కృష్ణపట్నం పోర్టుకు, మరికొంత మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి అంతటికి కారణం ఆయిల్ మాఫియా చేస్తున్నదొంగతనాలే కారణమని, ఎన్నో ఏళ్లుగా ఆయిల్ ను దొంగిలిస్తున్నా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే పరిశ్రమలు తరలిపోయే స్థితి ఏర్పడుతోందని సాక్షాత్తూ కాకినాడ పోర్టు డైరెక్టర్ కోయా ప్రవీణ్ చెప్పడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications