బీజేపీ ఎంపీ స్పెషల్ ఫ్లైట్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ జంప్ ? అసలేం జరిగిందంటే ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, పోలీసులకు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు చుక్కలు చూపిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓ భూవివాదంలో చిక్కుకున్న ఆయన్ను పోలీసులు గాలిస్తుండగానే పరారయ్యారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ఒకరు ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్సీని క్షేమంగా తప్పించేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు, పోలీసులు ఇంకా షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి) తాజాగా స్ధానికంగా పులివెందుల చక్రాయపేటలో ఓ భూవివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ ను ధ్వంసం చేసినట్లు పోలీసులు ఆయనతో పాటు మరో 30 మందిపై కేసు పెట్టారు. ఇందులో ఇప్పటికే 8 మందిని అరెస్టు కూడా చేశారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీటెక్ రవిని కూడా అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు.

బీటెక్ రవి కోసం పోలీసులు ముందుగా వైఎస్సార్ జిల్లాలో గాలించారు. కానీ ఆయన అప్పటికే తప్పించుకున్నారు. పులివెందుల నుంచి రహస్యంగా హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఆ తర్వాత చెన్నైకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు గాలిస్తున్న ఆయన గతంలో టీడీపీలో ఎంపీగా గెలిచి బీజేపీకి ఫిరాయించిన సీఎం రమేష్ సాయంతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
పులివెందుల పోలీసులు తన కోసం గాలిస్తుండటంతో హైదరాబాద్ వెళ్లిపోయిన బీటెక్ రవి.. అనంతరం అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రోడ్డు మార్గంలో వెళ్తే తిరిగి ఏపీ పోలీసులకు దొరికే అవకాశం ఉండటంతో ఆయనకు గాడ్ ఫాదర్ గా భావించే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సాయంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లిపోయారు. అదీ పేరు మార్చుకుని మరీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిగా ఉన్న ఆయన పేరును ఎం. రవీందర్ గా చూపించి ఆయన చెన్నైకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications