ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సుబోల్తా.. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . తెలంగాణా నుండి ఏపీకి వెళ్తున్న బస్సు బోల్తా పడింది . డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు . తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన వివరాలలోకి వెళ్తే నిర్మల్ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదానికి గురైంది . దీంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు ఆంధ్రప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. మితిమీరిన వేగంతో బస్సు నడుపుతున్న డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications