ఏపీ సచివాలయాల రంగు మారుతోంది- వైసీపీ రంగుల స్ధానంలో ఇక ఇదే....
ఏపీలో ప్రభుత్వ భవనాలకు రంగుల వ్యవహారంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో సర్కారు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ భవనాలకు ఉన్న వైసీపీ రంగులను తొలగించి మరో రంగు వేసేలా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలకు ఇదే రంగు వేయబోతున్నారు.

Recommended Video
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలకు ఇకపై తెల్ల రంగు వేయబోతున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విపక్షాలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కోర్టుల్లోనూ కేసులు వేశాయి. చివరకు పలుమార్లు విచారణల తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగుల స్ధానంలో తెల్లరంగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications