కేసీఆర్ కు దిమ్మతిరిగేలా.. తెలంగాణాకు జరిమానా వెయ్యాలని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ, తగ్గేదే లేదు!!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల వరుస లేఖలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకి రాసిన లేఖ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

ఆదేశాలు బేఖాతరు చేస్తున్న తెలంగాణాపై కఠిన చర్యలు తీసుకోండి
తాజాగా మరోమారు కృష్ణా నదీ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం, కృష్ణా బోర్డు పద్నాలుగవ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు లలో తెలంగాణ ప్రభుత్వం యధేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును, కృష్ణా బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. నిబంధనల మేరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది.

తెలంగాణా విద్యుత్ ఉత్పత్తికి వాడిన నీటిని నీటి వాటాలో లెక్కించండి
శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిన తర్వాతనే వరద జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో అనుమతి తీసుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేయరాదని మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ సర్కార్ అక్రమంగా వాడుకున్న 113.57 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్ర నీటి వాటాలో లెక్కించాలని ఏపీ ప్రభుత్వం లేఖలో విజ్ఞప్తి చేసింది.

ఆ విద్యుత్ లో 50 శాతం ఏపీకి ఇవ్వండి
అంతేకాదు నాగార్జునసాగర్, పులిచింతల నుండి అక్రమంగా వాడుకుని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసిన విద్యుత్ లో 50 శాతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో కోరింది. కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణ సర్కార్ ను కట్టడి చేయాలని లేఖ ద్వారా కృష్ణా బోర్డు కు విజ్ఞప్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ అంశంపై చర్చించడానికి కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఏపీ సర్కార్ కోరింది.

కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చెయ్యండి
నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కారణంగా శ్రీశైలంలో నీటిమట్టం పడిపోతుందని లేఖ ద్వారా పేర్కొంది ఏపీ. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి వల్ల వృధా అయిన నీటిని తెలంగాణ ఖాతాల్లో లెక్కించాలని విజ్ఞప్తి చేసిన ఏపీ, ఇప్పుడు విద్యుత్తు ఉత్పత్తి కోసం వినియోగించిన నీటిని కూడా తెలంగాణ నీటి వాటాలో లెక్కించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కోర్టును కోరింది. కేంద్రం ఆదేశాలను, కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరించిన తెలంగాణ సర్కార్ కు విభజన చట్టం ప్రకారం జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ముదిరిపోతున్న జల వివాదానికి అద్దం పడుతుంది. మరి ఈ వ్యవహారంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చెయ్యాలని ఏపీ కోరింది.

ఏపీ లేఖపై కృష్ణా బోర్డు స్పందిస్తుందా కేసీఆర్ ఏం చెయ్యనున్నారు ? ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖలోని అంశాలపై కృష్ణా బోర్డు స్పందిస్తుందా ? అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి వాటాల విషయంలో, విద్యుత్ ఉత్పత్తి విషయంలో తలెత్తిన వివాదాలను కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్ సర్కార్ కు షాక్ లు ఇస్తుంటే నీటి లెక్కలపై మెలికలు పెడుతుంటే సీఎం కేసీఆర్ ఏం చేస్తారో ? తెలంగాణా ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications