సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్! పసుపు రంగు పడింది!! కేసులు కూడా..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతేగాక, అన్ని గ్రామ సచివాలయాల రంగును కూడా మార్చేస్తున్నారు. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగును పోలివుండటం విమర్శలకు తావిచ్చింది కూడా.

అప్పుడు పసుపు.. ఇప్పుడు వైసీపీ..
ఇప్పటికే గ్రామ సచివాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు పూయడమేంటంటూ ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో పచ్చ రంగు పూస్తే మీరు మీ పార్టీ రంగును పూస్తున్నారా? మీకు ఆయనకు ఇక తేడా ఏంటీ? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

రంగులు, ఫొటోలు..
ఇక పార్టీ రంగులు గ్రామ సచివాలయాలకు వేయడమేంటి? అని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా నిలదీస్తున్నారు. ఈ కొత్త గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. గ్రామ సచివాలయాలకు రంగులు మార్చడంతోపాటు సీఎం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.

టీడీపీ అత్స్యుత్సాహం..
ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు విమర్శలతోపాటు ఆగకుండా అత్య్సుత్సాహాన్ని ప్రదర్శించారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడులో ఉన్న గ్రామ సచివాలయానికి ప్రభుత్వం వేసిన రంగును తొలగించి, పసుపు రంగు వేశారు.

సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్..
అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో స్థానంలో ప్రముఖ సినీ హీరో, టీడీపీ వ్యవస్థాకుడైన నందమూరి తారక రామారావు మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ను అంటించారు. ఇది గమనించిన అధికార వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

కేసులు నమోదు..
కాగా, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి పసుపు రంగేసిన ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
-
పాదయాత్ర ఇంకా ముందే ప్రారంభం: 'మావిగన్' ఆషామాషీగా చెప్పలేదు- జగన్..!! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల!












Click it and Unblock the Notifications