కుర్చీ గోలపై కడప రెడ్డమ్మ షాకింగ్..! అసలు జరిగింది అదేనట...!
నిన్న దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకల్ని అంతా ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో ఏపీలో కడపలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాత్రం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి మాత్రం అలిగారు. దీనికి కారణం ఆమెకు తగిన సీటు కేటాయించకపోవడమే. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనకు కేటాయించిన సీటులో కూర్చొన్నారని ఆమె అలిగి కాసేపు అక్కడే నిలబడి అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీనిపై వైసీపీ విమర్శలు గుప్పించింది. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి గతంలో కార్పోరేషన్ లో మేయర్ సీటు పక్కనే సీటు కావాలంటూ ఇలాగే కొట్లాడారని, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా అదే సీటు కోసం అలిగి వెళ్లిపోయారంటూ ఆమెను టార్గెట్ చేసింది. దీంతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి దీనిపై ఎక్స్ లో స్పందిస్తూ ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. ఇందులో నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారుల ఆహ్వానం మేరకు హాజరయ్యానని, కానీ తనకు కేటాయించిన ప్రదేశంలో వేరే అతిథులు కూర్చొన్నారని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తెలిపారు. అక్కడ కూర్చున్నవాళ్లు మన అధికారుల కుటుంబ సభ్యులే అన్నారు. వారిని అక్కడి నుంచి పంపేసి తాను కూర్చోవడం పద్ధతి కాదనిపించిందని, అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళిపోయానని వివరణ ఇచ్చారు. ఈ చిన్న విషయంపై సోషల్ మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారుల ఆహ్వానం మేరకు హాజరయ్యాను. కానీ నాకు కేటాయించిన ప్రదేశంలో వేరే అతిథిలు కూర్చున్నారు. అక్కడ కూర్చున్నవాళ్లు మన అధికారుల కుటుంబ సభ్యులే, వారిని లేపించి నేను కూర్చోవడం పద్ధతి కాదనిపించింది, అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళిపోయాను.… pic.twitter.com/f8H3o7RNIl
— Reddeppagari Madhavi (@R_Madhavi_Reddy) August 16, 2025
అయితే నిన్న ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలు చూస్తే మాత్రం అధికారులపై మాధవీరెడ్డి చిరుబుర్రులాడటం స్పష్టంగానే కనిపించింది. జేసీ అతిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన భర్త పక్కనే కాసేపు నిలబడిన దృశ్యాలు నిన్న బయటికి వచ్చాయి. కానీ ఇదే చిన్న విషయమని మాధవీరెడ్డి కొట్టిపారేశారు. ఓవైపు అధికారుల కుటుంబ సభ్యుల్ని సీటు ఖాళీ చేయమని చెప్పలేక వెళ్లిపోయినట్లు ఆమే చెప్పుకున్నారు. దీనిపైనా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications