కడపకు మోడీ వస్తున్నారు! అందుకే టీడీపీ దొంగ దీక్షలు: కందుల విసుర్లు, వెంకయ్యతో భేటీ
న్యూఢిల్లీ: కడపలోనే కాదు, విశాఖపట్నంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంపై మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో కలిశారు.

వెంకయ్యతో చర్చలు
వెంకయ్యనాయుడుతో చర్చ అనంతరం కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 సంవత్సరంలో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, చివరిపేరాలో ప్రస్తావించిన మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక గురించి ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపించారు.

కడపకు మోడీ వస్తున్నారు.. అందుకే టీడీపీ దీక్షలు
ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ విశాఖలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని రాజమోహన్ రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వస్తుందన్న విషయం తెలుసు కాబట్టే టీడీపీ నేతలు దీక్షల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

అప్పుడేమో అలా.. ఇప్పుడు 6రోజులుగా దీక్షలెలా చేస్తున్నా..
టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2014లో సెయిల్ నివేదిక.. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రమేష్ సహా టీడీపీ నేతల దీక్షల్లో చిత్తశుద్ధి లేదని, పార్లమెంటులో 6గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు.. ఇప్పుడు 6రోజులుగా ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ఆయన ప్రశ్నించారు.

దొంగదీక్షలు-కొంగజపాలు..
బీజేపీ నేత రఘునాథ్ బాబు మాట్లాడుతూ.. రాయలసీమ వ్యక్తినంటూ చెప్పుకునే చంద్రబాబు.. సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ దొంగదీక్షలు, కొంగజపాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 300మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోందని, స్టీల్ ధర పెరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి తీరుతుందని రఘునాథ్ బాబు స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications