వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ అసలు విషయం: వినోద్, తప్పదని కమల్ ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR clarifies national leaders doubts on resolution: Vinod
న్యూఢిల్లీ/హైదరాబాద్: శాసన సభలో సీమాంధ్ర నేతలు చేసిన కుట్రలను తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ పార్టీ నాయకులను కలిసి వివరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గురువారం అన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలోని ఇరుసభలు తిరస్కరించాయని సీమాంధ్ర ప్రాంత నేతలు జాతీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ వారికి అసలు విషయాన్ని చెప్పారని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నూతన ఒరవడి సృష్టించుకుందామన్నారు.

తెలంగాణ బిల్లుపై ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయం చెప్పినట్లు సభాపతి అప్పుడే ప్రకటించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం పేరిట వారు మోసం చేశారన్నారు. కుట్రలు చేయడం సీమాంధ్ర నేతలకు అలవాటే అన్నారు. ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత కెసిఆర్‌దే అన్నారు.

2014లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలన్నారు. సీమాంధ్ర నాయకులు తమ హక్కులు, తమ ప్రజలకు కావాల్సినవి, వారి సమస్యల పరిష్కారానికి కావాల్సిన అంశాలను బిల్లులో పొందుపర్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఆగదన్నారు.

బిజెపి వెనక్కి పోతుందనుకోను: పొన్నాల

తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ వెనక్కి పోతుందని తాను అనుకోవడం లేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ పైన నిర్ణయం ఆషామాషీగా తీసుకున్నది కాదని, నిబంధనలకు అనుగుణంగానే తీసుకున్నారన్నారు.

వచ్చే సభలోనైనా తప్పదు: కమల్ నాథ్

తెలంగాణ ముసాయిదా బిల్లును వచ్చే సభలోనైనా ప్రవేశ పెట్టక తప్పదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ఢిల్లీలో అన్నారు. తెలంగాణ అంశం రెండు ప్రాంతాల భావోద్వేగాలకు సంబంధించిందని తెలిపారు. తెలంగాణ అంశం ఎంతో సున్నితమైనదని, జాగ్రత్త పరిష్కరించాల్సి అవసరముందని అన్నారు. తెలంగాణ అంశాన్ని కేవలం పార్లమెంటు మాత్రమే పరిష్కరించగలదని చెప్పారు. ప్రస్తుత లోక్‌సభ గానీ, వచ్చే లోక్‌సభగానీ ఈ సమస్యను పరిష్కరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
Telangana Rastra Samithi senior leader Vinod Kumar on Thursday said party cheif K Chandrasekhar Rao clarified national leaders doubts on Assembly resolution on Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X